“సబాల్టర్న్”, లౌకికము: కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశం పై

కాంగ్రెస్ తన కొత్త విజన్‌కు అనుగుణంగా ప్రచారాన్ని నిర్మించాలి

Published - February 28, 2023 11:14 am IST

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ముగిసిన కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల వ్యూహాన్ని తో పాటు పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గే అధికారాన్ని బలోపేతం చేయడం పై వివరించింది. భావసారూప్యత గల లౌకిక పార్టీలతో కలిసి పనిచేయడానికి తన సుముఖత స్పష్టంగా వ్యక్తపరచడమే కాకుండా, ఒక పార్టీకి ఒక ప్రాథమిక మార్పు తెచ్చే పదునైన సామాజిక న్యాయ ఎజెండాను అనుసరించాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. పార్టీ కి ఎల్లవేళలా సంక్షేమ ఎజెండా ఉన్నప్పటికీ, ఇతర పార్టీల ను మరింత అనుకూలంగా భావించే “సబాల్టర్న్‌” (సామాజికంగా, రాజకీయంగా మరియు భౌగోళికంగా అధికార శ్రేణి నుండి దూరంగా ఉంచబడిన వ్యక్తులు) ల రాజకీయ ఆకాంక్షలకు అనుగుణంగా అది చోటు కల్పించడం లో విఫలమైంది. పార్టీ సామాజిక న్యాయం పై ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది, ఇతర వెనుకబడిన తరగతుల (OBC) సాధికారత కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను వాగ్దానం చేసింది. అలాగే, అధికారంలోకి వస్తే సామాజిక న్యాయం కోసం జాతీయ మండలి ఏర్పాటు, వార్షిక “స్టేట్ ఆఫ్ సోషల్ జస్టిస్” నివేదిక ను జాతీయ ఆర్థిక సర్వే లాగా ప్రచురించడం, షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST) మరియు OBC లకు ఉన్నత న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు మరియు వెనుకబడిన వర్గాల విద్యార్థులకు రోహిత్ వేముల చట్టం చేయడం లాంటి వాగ్దానాలు ఆ తీర్మానంలో ఉన్నాయి. మండల్ అనంతర కాలంలో ప్రాంతీయ పార్టీల చేతిలో ఓడిపోయిన ఆ పార్టీ ఇప్పుడు “సబాల్టర్న్‌”లను తనవైపు తిప్పుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి, ప్రారంభ చర్య గా, SCలు, STలు, OBCలు, మహిళలు మరియు మైనారిటీలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కి సగం సీట్ల ను రిజర్వ్ చేయడానికి దాని స్వంత రాజ్యాంగాన్ని సవరించింది. అయితే గత సంవత్సరం ఉదయ్‌పూర్ చింతన్ శివిర్‌లో పార్టీ యొక్క పవిత్రమైన ప్రకటనలు దాదాపు వెంటనే విరమించబడ్డాయి మరియు రాయ్‌పూర్ తీర్మానాలకు కట్టుబడి ఉంటారా అనేది రాబోయే నెలల్లో చూడాల్సి ఉంటుంది.

కనీస ఆదాయం మరియు పేదలకు సామాజిక భద్రత కోసం చట్టపరమైన హామీలను కలిగి ఉండే సామాజిక భద్రతా ఫ్రేమ్‌వర్క్ అయిన “సంపూర్ణ సామాజిక్ సురక్ష”కు పార్టీ హామీ ఇచ్చింది. ప్రాథమిక ఆదాయము హక్కు కల్పించే న్యుంతమ్ ఆయ్ యోజన (న్యాయ్), ఆరోగ్య హక్కు, ఒంటరి మహిళలు, వృద్ధులు మరియు వికలాంగులకు పింఛన్లు, సమగ్రమైన సమగ్ర శిశు అభివృద్ధి పథకం జాతీయ ఆహార భద్రతా చట్టం అనుగుణంగా, నాణ్యమైన ప్రాథమిక పాఠశాల విద్య మరియు ప్రసూతి అర్హతలు ద్వారా భారతీయులందరికీ సార్వత్రికమైన హక్కులను కూడా వాగ్దానం చేస్తుంది. పెరుగుతున్న అసమానతలు, నిరుద్యోగం మరియు అండర్ ఎంప్లాయిమెంట్ వంటి ఇతర సవాళ్లను తగ్గించడానికి కొత్త సంక్షేమ ఫ్రేమ్‌వర్క్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది మరియు కాంగ్రెస్ ఆలోచనలు భారతదేశంలో తాజా సమాచారపూరితమైన చర్చకు దారి తీయాలి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ NYAY లేదా సార్వత్రిక ఆదాయ పథకంపై బ్యాంక్ చేసినప్పటికీ, అది ఎటువంటి ఎన్నికల డివిడెండ్‌లను పొందలేదు. సాంఘిక గుర్తింపుకు కూడా కారణమయ్యే భరోసా ఆదాయం తో కూడిన మంచి భవిష్యత్తు వాగ్దానం భారతీయ జనతా పార్టీ (బిజెపి) యొక్క హిందుత్వ ప్లస్‌ను ఎదుర్కోగలదని పార్టీ ఇప్పుడు భావిస్తోంది. అసమానత అనేది కేవలం భౌతికమైనది కాదని, వివక్ష అనేది కేవలం మతపరమైన కోణం మాత్రమే కాదనే వాస్తవాన్ని కాంగ్రెస్ అంగీకరించడం ద్వారా, ఇటీవలి సంవత్సరాలలో బిజెపి కి ప్రయోజనం చేకూర్చే సెక్యులర్-కమ్యూనల్ బైనరీ కి మించి చర్చను తీసుకువెళ్లింది. ఈ వ్యూహం విజయవంతం కావాలంటే, కాంగ్రెస్ తన లక్షణమైన పిరికితనాన్ని విడిచిపెట్టి, దాని కొత్త ఆలోచన కు అనుగుణంగా బలమైన రాజకీయ ప్రచారాన్ని నిర్మించాలి.

This editorial has been translated from English, which can be read here.

0 / 0
Sign in to unlock member-only benefits!
  • Access 10 free stories every month
  • Save stories to read later
  • Access to comment on every story
  • Sign-up/manage your newsletter subscriptions with a single click
  • Get notified by email for early access to discounts & offers on our products
Sign in

Comments

Comments have to be in English, and in full sentences. They cannot be abusive or personal. Please abide by our community guidelines for posting your comments.

We have migrated to a new commenting platform. If you are already a registered user of The Hindu and logged in, you may continue to engage with our articles. If you do not have an account please register and login to post comments. Users can access their older comments by logging into their accounts on Vuukle.