చెడు మరియు వికారము

 ఒక గవర్నర్ సంప్రదాయ ఉల్లంఘన అవాంఛనీయ సంఘటనలుకు దారితీసింది

Updated - January 11, 2023 12:09 pm IST

Published - January 11, 2023 11:39 am IST

అవాంఛనీయ సంఘటనలు అంచనాలు వాటంతట అవే నెరవేరుతాయి. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి కొత్త సంవత్సరం మొదటి సెషన్‌ను తన ప్రసంగము తో ప్రారంభించేందుకు శాసనసభకు రావడం చాలా మంది ఊహించిన నాటకాన్ని ప్రదర్శించడం. శ్రీ రవి గత కొంతకాలంగా వివాదాస్పద రాజకీయ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం తనను తాను ‘తమిళనాడు’ అని పిలవకూడదని, దాని రాజకీయాలు “తిరోగమనం”గా ఉన్నాయని ఆయన ఇటీవల రోజుల్లో విచక్షణారహితంగా చేసిన వ్యాఖ్యలు సభలో ప్రసంగించడానికి వచ్చినప్పుడు ఉద్రిక్తతను సూచిస్తున్నాయి. శ్రీ రవి విధానం యొక్క దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, DMK పాలన యొక్క తన ఈ ఎరను శాసనసభలోకి తీసుకువెళ్లారు, అందులో అతను అంతర్భాగంగా ఉన్న దాని విస్మరించి. ఈ నేపథ్యంలో, శ్రీ రవి “ద్రావిడ పాలనా నమూనా” మరియు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని ప్రశంసించే పదాలతో సహా సిద్ధం చేసిన వచనం లోని భాగాలను దాటవేయాలని ఎంచుకున్నారు. గవర్నర్లు సిద్ధం చేసిన వచనముల నుంచి వైదొలిగిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఇతర రాష్ట్రాల్లో కాకుండా, ఇది ముఖ్యమంత్రి M.K స్టాలిన్ నుండి తక్షణ వ్యతిరేకతను రేకెత్తించింది. రాష్ట్రపతి లేదా గవర్నర్ వచనము నుండి వైదొలగకూడదనే రాజ్యాంగ సంప్రదాయం, ఎందుకంటే ఇది ఎన్నికైన ప్రభుత్వ విధాన ప్రకటన తప్ప మరొకటి కాదు. గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు ఇలాంటి వైదొలగాడాని పక్కనపెట్టి ఘర్షణకు దూరంగా ఉన్నారు. అయితే, శ్రీ స్టాలిన్, గవర్నర్ సమక్షంలో ఒక తీర్మానం ద్వారా తక్షణ ప్రతిస్పందనను అందజేయాలని నిర్ణయించుకున్నారు, ఇది హౌస్ రికార్డ్ సిద్ధం చేసిన వచనం మాత్రమే ప్రతిబింబిస్తుంది మరియు గవర్నర్ తన ప్రసంగం సమయంలో చేసిన ఆకస్మిక చేర్పులు లేదా తొలగింపు ల తొ కాదు అని.

తమిళంలో శ్రీ స్టాలిన్ ప్రసంగం యొక్క ప్రాముఖ్యతను గ్రహించిన వెంటనే, శ్రీ రవి ఆ తీర్మానాన్ని అవలంబించే చర్యను అవమానంగా భావించి బయటకు వెళ్లిపోయారు. గవర్నర్ పక్షాన ఒక సంప్రదాయ ఉల్లంఘన జరిగినప్పుడు వెంటనే స్పందించకపోవడానికి ఎటువంటి కారణం లేదు అది కూడా సంప్రదాయ ఉల్లంఘన ఐనా, కాబట్టి గవర్నర్ అలా స్పందించాల్సిన అవసరం లేదు. ఈ సంఘటనలు రాజ్యాంగ కార్యనిర్వాహకులు సంఘర్షణ వైఖరి యొక్క పరిణామాలను హైలైట్ చేస్తాయి. రాజకీయ కోణం తో చేసిన వ్యాఖ్యలపై గవర్నర్ తన ప్రవృత్తిని విడిచిపెట్టి, రాష్ట్ర రాజకీయ సున్నితత్వాన్ని గమనించినట్లయితే భవిష్యత్తులో ఘర్షణలను నివారించవచ్చు. దీర్ఘకాలంలో, దేశ రాజ్యాంగ పథకంలో గవర్నర్ పాత్రను సమగ్రంగా మార్చాల్సిన అవసరం ఉంది, తద్వారా రాజ్‌భవన్‌లో అధికారంలో ఉన్నవారు తమ ఆధిపత్య భావాన్ని విడిచిపెట్టి, బిల్లులకు ఆమోదం ఇవ్వడం వంటి వారి ప్రధాన రాజ్యాంగ విధుల పై దృష్టి పెడతారు.

This editorial has been translated from English, which can be read here.

0 / 0
Sign in to unlock member-only benefits!
  • Access 10 free stories every month
  • Save stories to read later
  • Access to comment on every story
  • Sign-up/manage your newsletter subscriptions with a single click
  • Get notified by email for early access to discounts & offers on our products
Sign in

Comments

Comments have to be in English, and in full sentences. They cannot be abusive or personal. Please abide by our community guidelines for posting your comments.

We have migrated to a new commenting platform. If you are already a registered user of The Hindu and logged in, you may continue to engage with our articles. If you do not have an account please register and login to post comments. Users can access their older comments by logging into their accounts on Vuukle.