ముందు ఉండీ నాయకత్వము వహించడము

G20 సమ్మిట్ అధ్యక్షుడిగా గ్లోబల్ సౌత్ యొక్క అభిప్రాయాలను భారతదేశం తప్పనిసరిగా విస్తరించాలి

January 17, 2023 11:41 am | Updated 12:15 pm IST

వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ సమ్మిట్” అని పిలవబడే అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం ప్రభుత్వ సమ్మిట్, దాని మొదటి పెద్ద నాయకత్వ స్థాయి G20 కార్యక్రమంగా, చాలా ముఖ్యమైన సంకేతం. న్యూ ఢిల్లీ తన దృష్టిని UNSC P5 మరియు G-7 (అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు)తో దాని సంబంధాన్ని కలిగి ఉన్న ప్రపంచ నాయకత్వం యొక్క “హై-టేబుల్” వైపు నుంచి నిష్క్రమించి, ప్రపంచం యొక్క మరింత న్యాయమైన దృక్పథం పై దృష్టి పెట్టడం మరియు ఎలా ప్రపంచ అసమానతలతో అభివృద్ధి చెందుతున్న ప్రపంచం ప్రభావితమవుతుందని. వర్చువల్ సమ్మిట్‌లో తన ప్రారంభ వ్యాఖ్యలలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ మార్పుకు గల కారణాలను వివరించారు: “COVID మహమ్మారి యొక్క సవాళ్లు, ఇంధనం, ఎరువులు మరియు ఆహారధాన్యాల ధరలు పెరగడం మరియు పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మన అభివృద్ధి ప్రయత్నాలను ఎలా ప్రభావితం చేశాయో”. విదేశాంగ మంత్రి S. జైశంకర్ కూడా భారతదేశం యొక్క గ్లోబల్ సౌత్‌తో ఉమ్మడి భవిష్యత్తును ఊహించుకోవడం మరియు గ్లోబల్ సౌత్‌తో భారతదేశం యొక్క “కామన్ పాస్ట్”ను గుర్తించడం గురించి మాట్లాడారు, వీరిలో చాలా మంది వలసవాదాన్ని ఎదుర్కొన్నారు. 10కి పైగా వివిధ సెషన్‌లలో, భారతదేశం మరియు G-77లో ఉన్న 134 దేశాలకు చెందిన 125 దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ ల్యాండ్ స్కేప్ విచ్ఛిన్నం కావడం, ఉక్రెయిన్ యుద్ధం మరియు తీవ్రవాదం ఫలితంగా ధాన్యం ఎగుమతులు, చమురు, ఎరువులు మరియు గ్యాస్‌లలో కొరత వంటి కీలక సమస్యలని అంగీకరించారు. అభివృద్ధి వ్యయం ఐనా వాతావరణ మార్పుల లక్ష్యాలను వేగవంతం చేయడం అనే “మొదటి ప్రపంచం” దృక్కోణానికి వ్యతిరేకంగా, ప్రపంచ దక్షిణాదిలోని నైపుణ్యం కలిగిన జనాభా కు వలసలు మరియు పని చైతన్యం మరియు స్థితిస్థాపకంగా పునరుత్పాదక ఇంధన సదుపాయాన్ని నిర్ధారించడం వంటి “మానవ కేంద్రీకృత” ప్రపంచీకరణ కోసం శ్రీ మోదీ యొక్క పుష్ గమనించదగినది. G20 ప్రెసిడెంట్‌గా ఉన్న సంవత్సరంలో భారతదేశ విదేశాంగ విధాన దృక్పథాన్ని రీసెట్ చేసినట్లు గా ఈ శిఖరాగ్ర సమావేశం కనిపిస్తుంది: ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రభుత్వం పక్షం వహించడానికి నిరాకరించడము, నొన్ అలైన్‌మెంట్ యొక్క నిజమైన అర్థాన్ని తిరిగి పొందేలా చేసింది. క్యూబా G77 ఛైర్‌పర్సన్‌షిప్‌ను స్వీకరించె సమయములో ( G77 సమూహాన్ని భారతదేశం దూరంగా ఉంచింది) విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి ఆ దేశానికి వెల్లడము మరియు రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఈజిప్ట్ ప్రెసిడెంట్, NAM సహ వ్యవస్థాపకుడిని ఆహ్వానించడం కూడా ముఖ్యమైనవి.

సమ్మిట్ యొక్క కొన్ని మినహాయింపులు గమనించదగినవి: పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్. మయన్మార్‌ను చేర్చుకోవడం కూడా గమనించదగ్గ విషయం, దీని జుంటా పాలన గుర్తించబడలేదు, కానీ దానితో భారతదేశం సన్నిహిత సంబంధాల ను ఏర్పరచుకుంది. ప్రపంచ సమస్యల పై దక్షిణ-దక్షిణ సామూహిక అవగాహన శిఖరాగ్ర స్థాయి లో మరింత సమగ్ర సమావేశానికి దారి తీస్తుందని, ముఖ్యంగా దక్షిణాసియా మరియు ఉపఖండంలోని ప్రాంతీయ సమస్యల గురించి ప్రస్తావించాలని భావిస్తున్నారు. సమూహం సాధారణ లేదా ఉమ్మడి ప్రకటనను విడుదల చేయలేదు మరియు ఫలితాలాంటి అంశాలు చాలా మటుకు శ్రీ మోడీ మరియు శ్రీ జైశంకర్ చెప్పినదాని పై నిర్మించబడిందని కూడా గమనించాలి. భారతదేశం ‘G20 వద్ద గ్లోబల్ సౌత్ వాయిస్’గా వినిపించాలంటే, అది ఇతర దేశాల ఆకాంక్షలను ప్రతిబింబించాలి మరియు ఈ సంవత్సరం చివర్లో జరిగే G20 శిఖరాగ్ర సమావేశంలో అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి నిజమైన నాయకుడిగా వాటిని విస్తరించాలి.

This editorial was translated from English, which can be read here.

0 / 0
Sign in to unlock member-only benefits!
  • Access 10 free stories every month
  • Save stories to read later
  • Access to comment on every story
  • Sign-up/manage your newsletter subscriptions with a single click
  • Get notified by email for early access to discounts & offers on our products
Sign in

Comments

Comments have to be in English, and in full sentences. They cannot be abusive or personal. Please abide by our community guidelines for posting your comments.

We have migrated to a new commenting platform. If you are already a registered user of The Hindu and logged in, you may continue to engage with our articles. If you do not have an account please register and login to post comments. Users can access their older comments by logging into their accounts on Vuukle.