ఆగస్ట్ 2021లో తాలిబాన్ కాబూల్ను స్వాధీనం చేసుకున్నప్పుడు, అప్పటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆఫ్ఘనిస్తాన్ “బానిసత్వం యొక్క సంకెళ్ళను తెంచుకుంది” అని అన్నారు. తాలిబాన్ నాయకత్వానికి ఆశ్రయం కల్పించిన పాకిస్తాన్, ఆఫ్ఘన్ అంతర్యుద్ధంలో విజయం సాధించిన వాటిలో ఒకటిగా పరిగణించబడుతుంది. కానీ తాలిబాన్ విజయం సున్నీ ఇస్లామిస్ట్ తిరుగుబాటు యొక్క పాకిస్థానీ వెర్షన్ అయిన తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP)ని కూడా ధైర్యపరచడంతో వేడుకల దశ క్షీణించింది. అప్పటి నుండి, పాకిస్తాన్ తీవ్రవాద దాడులను చూసింది, ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని ఖైబర్ పఖ్తున్ఖ్వాలో. పెషావర్లోని అత్యంత పటిష్టమైన పోలీస్ లైన్ ప్రాంతంలోని మసీదులో సోమవారం జరిగిన పేలుడు, కనీసం 100 మంది ప్రాణాలను బలిగొంది, ఇది ఎన్నో సంవత్సరాలలో పాకిస్తాన్లో అత్యంత ఘోరమైనది మరియు “మంచి తాలిబాన్” కు మద్దతు ఇవ్వడం మరియు “చెడు తాలిబాన్” తో పోరాడడం అనే దాని వ్యూహం ఎలా ఎదురుదెబ్బ తగిలిందో పదునైన గుర్తు చేసే అంశం. ఒక TTP వర్గం మొదట బాధ్యత వహించింది, కానీ ఒక ప్రతినిధి ఎటువంటి పాత్ర ను తిరస్కరించారు. ఇది దాని ప్రమేయం గురించి సందేహాల ను పెంచడం కంటే సమూహంలోని విభజనలను ప్రదర్శిస్తుంది. పేలుడు TTP దాడి యొక్క లక్షణాలను కలిగి ఉంది - ఇది దాని బలమైన ప్రదేశంలో జరిగింది మరియు భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంది. మరియు ఏ ఇతర సమూహం బాధ్యత వహించ లేదు.
TTP మరియు ఆఫ్ఘన్ తాలిబాన్లు సంస్థాగతంగా భిన్నంగా ఉండవచ్చు, కానీ వారు సైద్ధాంతికంగా సోదరులు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు చేయగలిగినది పాకిస్తాన్లో TTP చేయాలనుకుంటున్నది. 2014 పెషావర్ స్కూల్ బాంబు దాడిలో 150 మందికి పైగా మరణించిన తర్వాత, ఎక్కువ మంది పిల్లలు, పాకిస్తానీ సైన్యం సమూహం పై విరుచుకు పడింది. కానీ ఆఫ్ఘన్ తాలిబాన్ తిరిగి అధికారంలోకి రావడంతో సరిహద్దు ప్రాంతంలో తిరుగుబాటు డైనమిక్స్ మారిపోయింది. మిస్టర్ ఖాన్ TTP పట్ల నిమగ్న విధానాన్ని అనుసరించారు. ఆఫ్ఘన్ తాలిబాన్ TTP మరియు పాకిస్తాన్ మధ్య చర్చలు జరిపింది, ఇది కాల్పుల విరమణకు దారితీసింది. అయితే ఏడాదిపాటు కొనసాగిన సంధి గత ఏడాది నవంబర్లో కుప్పకూలింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆయుదాలు సేకరించడానికి మరియు దాని పునర్వ్యవస్థీకరణకు ఉపయోగించుకున్న TTP ఇప్పుడు ఎక్కువ మందుగుండు సామగ్రితో భీభత్సాన్ని వ్యాప్తి చేస్తోందని చాలా మంది నమ్ముతున్నారు. పెషావర్ పేలుడు రాజకీయ అస్థిరత కొనసాగుతున్న సమయంలో వచ్చింది, మిస్టర్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎడతెగని ప్రచారానికి నాయకత్వం వహించడం, పాకిస్తాన్ కరెన్సీ క్షీణించడం, దాని విదేశీ నిల్వలు పడిపోవడం, ద్రవ్యోల్బణం పెరగడం మరియు విద్యుత్ పరిస్థితి భయంకరంగా కావడము తో. అప్పులు తీర్చలేక ప్రభుత్వం ‘బెయిలవుట్ ప్యాకేజీ’ కోసం IMFతో చర్చలు జరుపుతోంది. మరియు ఇప్పుడు, భద్రతా సవాలు ఉంది. వర్ణాత్కమైన పోరాటము మరియు వర్ణాత్కమైన తీవ్రవాదాన్ని ఆశ్రయించే విధానం వల్ల మేలు కంటే కీడే ఎక్కువని పాకిస్థాన్ గ్రహించాలి. ఉగ్రవాదం పట్ల దాని దృక్పథంలో ఒక సమూల మార్పు అవసరం, అయితే, మరింత అత్యవసరంగా, దాని వనరులను కూడగట్టుకొని పాకిస్తాన్ తన రాష్ట్రానికి అతి పెద్ద అంతర్గత భద్రతా ముప్పుగా ఉన్న TTP వెనుకాల పడడం.
This editorial has been translated from English, which can be read here.