భారతదేశం-పాకిస్తాన్ సంబంధాల యొక్క శాశ్వతమైన కఠినమైన మార్గంలో, గత వారం పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన చర్చ ల వంటి ఏదైనా ప్రతిపాదన సమానమైన ఉత్సాహం మరియు విరక్తి కి కారణం. యుఎఇ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, పాకిస్తాన్ భారతదేశంతో “మూడు యుద్ధాల నుండి పాఠం నేర్చుకుంది” మరియు “కాశ్మీర్ వంటి బర్నింగ్ పాయింట్లు తో సహా మన నిజమైన సమస్యలు పరిష్కరించ కలిగితే భారతదేశంతో శాంతియుతంగా జీవించాలని కోరుకుంటుంది” అని అతని మాటలు తన దేశం అల్లకల్లోలంగా ఉన్న సమయంలో, అతని నిస్సహాయమైన స్థితిని సూచిస్తుంది అని న్యూ ఢిల్లీ లో అనుకుంటున్నారు. రాజకీయంగా, మిస్టర్ షరీఫ్ ఈ ఏడాది చివర్లో ఎన్నికలను ఎదుర్కోవలసి ఉంది మరియు మాజీ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రతిపక్షాల నుండి సవాలును ఎదురుకుంటున్నారు. ఆర్థికంగా, పాకిస్తాన్ రుణ ఎగవేత ప్రమాదంలో ఉంది, UAE, సౌదీ అరేబియా మరియు చైనా నుండి మద్దతు హామీతో దాన్ని కలిసి ఉంచుతుంది, అలాగే దాని IMF బెయిలవుట్ ప్యాకేజీ మరిన్ని పొదుపు చర్యల ను అవలంబించడం ద్వారా వస్తుంద ని ఆశిస్తోంది. పాకిస్తాన్ తన ఆఫ్ఘన్ సరిహద్దు నుండి పెరుగుతున్న ఉగ్రవాద ముప్పు ను ఎదుర్కొంటోంది, ఇక్కడ స్నేహపూర్వక పాలన నియంత్రణలో ఉన్నప్పటికీ, ముఖ్యంగా తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ యోధులతో ఘర్షణలు జరుగుతున్నాయి. అయినప్పటికీ, మిస్టర్ షరీఫ్ యొక్క శాంతియుత మాటలు, UNలో కత్తులు దూసిన ఒక నెల తర్వాత, పాకిస్తాన్ యొక్క ప్రస్తుత పరిస్థితులకు భారతదేశం బాధ్యత కాదు అనే ఒక అవగాహన ఉందని మరియు ఒక విధమైన నిమగ్నత చూయిస్తే అక్కడి ప్రభుత్వానికి ప్రయోజనం చేకూరుతుందని సూచిస్తుంది. “ఉగ్రవాదం, శత్రుత్వం లేదా హింస” లేని అనుకూలమైన వాతావరణం ఉన్నట్లయితే, భారతదేశం “పాకిస్తాన్తో సాధారణ పొరుగు సంబంధాలను” కోరుకుంటుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిస్పందన, ఢిల్లీ తన స్థానాన్ని కొనసాగించాలని సూచించింది, అయితే మిస్టర్ షరీఫ్ ఆఫ్ఫర్ను తుంగలో తొక్కడం ఇష్టం లేదని చెప్పుతుంది
మిస్టర్ షరీఫ్ మాటల సమయం చూస్తే దానికి ఇంకా ఎక్కువ విలువ ఉంది; ఈ వేసవిలో SCO సమ్మిట్కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం సిద్ధమవుతున్నందున, ప్రధాన సమావేశాలకు పాకిస్తాన్ పాల్గొనే ఆహ్వానాలు అందచేయబడతాయి మరి ఇలాంటి సమయంలో మరింత స్నేహపూర్వక సంబంధం ఉంటే అన్నీ సాఫీగా ప్రయాణించేలా చేస్తుంది. భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీ మరియు ఉక్రెయిన్ యుద్ధం మధ్య గ్లోబల్ సౌత్ యొక్క ఆందోళనలను ప్రోత్సహించాలనే దాని కోరికకు, పొరుగున ఉన్న శాంతి నుండి కూడా ప్రయోజనం పొందుతుంది. షరీఫ్ మాటలు ప్రభావం కోసం మాత్రమే చేశారా లేక చర్చ ల కోసం ముందుకు రావాల నే నిజమైన కోరిక తో చేశారా అనేది చూడాలి. SCO ఆహ్వానాన్ని ఆమోదించడం ద్వారా లేదా 2019 నుంచి రాయబారులు లేని రెండు రాజధానులలో మిషన్ బలాన్ని పునరుద్ధరించే ప్రతిపాదనతో, ఇస్లామాబాద్ నిజంగా అనుసరిస్తే, న్యూఢిల్లీ పరస్పరం ప్రతిస్పందించగలదని ఆశించవచ్చు. ప్రభుత్వం రష్యా మరియు ఉక్రెయిన్లకు “సంభాషణ మరియు దౌత్యం” కోసం సలహా ఇస్తూ మరియు “వ్యావహారికసత్తావాదం” నుండి తాలిబాన్లను నిమగ్నం చేయాలని ప్రయత్నిస్తున్న తరుణంలో, ప్రాంతీయ స్థిరత్వాన్ని పెంపొందించే అటువంటి అవకాశాన్ని తిరస్కరించడం విరుద్ధమైనదిగా అనిపిస్తుంది, ముఖ్యంగా భారతదేశం రాజనీతిజ్ఞుని పాత్ర హైలైట్ అయ్యే సంవత్సరం లో.
This editorial has been translated from English, which can be read here.